అమరరావతి : రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఉదయం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
ఈ క్రమంలో కర్ఫ్యూ నుంచి పలు సేవలకు ప్రభుత్వం మినహాయింపు నిచ్చింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు టెలికామ్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ అవుట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు నిచ్చింది.
విమాన, రైల్వే ప్రయాణికులు విధిగా టికెట్లు చూపించాలని ఆదేశించింది. సరిహద్దులో రేపటి నుంచి పబ్లిక్ వాహనాలపైనా ఏపీ సర్కార్ ఆంక్షలు విధించింది.
అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్ పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు రాష్ట్రంలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.