న్యూఢిల్లీ, ఆగస్టు 22: దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా ఆదివారం లీటరు పెట్రోల్పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. లీటరు డీజిల్పై కూడా 20 పైసలను తగ్గించాయి. వారం వ్యవధిలో డీజిల్పై 20 పైసలు చొప్పున తగ్గించడం ఇది నాలుగోసారి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.64, డీజిల్ ధర రూ.89.07 పలుకుతున్నది.