న్యూఢిల్లీ : గల్వాన్లో చైనా జవాన్లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఐండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళంలోని 20 మందికి ప్రభుత్వం శౌర్యపతకాలు (I-Day Medals) ప్రకటించింది. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా దళాలను మన భూభాగంలోకి రాకుండా అడ్డుకుని శౌర్యాన్ని ప్రదర్శించారు. వీరి సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం శైర్య పతకాలను అందజేయాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 1,380 సేవా పతకాలలో ఈ పతకాలు కూడా ఉన్నాయి.
తాజా అవార్డుల జాబితాలో రెండు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీపీఎంజీ), 628 పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎమ్జీ), విశిష్ట సేవలకు 88 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, మెరిటోరియస్ సర్వీస్ కోసం 662 పోలీస్ మెడల్స్ ఉన్నాయి. జమ్ముకశ్మీర్ పోలీసు (జేకేపీ) సబ్ ఇన్స్పెక్టర్ అమర్ దీప్, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కాలే సునీల్ దత్తాత్రేయ (మరణానంతరం) మాత్రమే అత్యుత్తమ ధైర్య పతకాం.. రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు మెడల్ ప్రభుత్వం ప్రకటించింది.
టర్కీలో వరదలు : 44 మంది దుర్మరణం
జెండా ఏర్పాటు పనిలో ప్రమాదం : ముగ్గురు మృతి
ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికేలా చూడాలి : వెంకయ్యనాయుడు
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్కు ఐసీసీ మార్గదర్శకాలు
తాలిబాన్లకు పాక్ జనరల్స్ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ
ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
ఇంగ్లండ్లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..