బెంగళూరు : (Discrimination) కర్నాటకలో వివక్ష ఇంకా కొనసాగుతున్నదని చెప్పడానికి కొప్పాల్ జిల్లాలో జరిగిన సంఘటనను ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. రెండేండ్ల బాలుడు గుడిలోకి వచ్చాడని ఆ కుటుంబానికి అగ్రవర్ణాలు రూ.25 వేల జరిమానా విధించారు. పిల్లాడి పుట్టినరోజున దేవుడ్ని దర్శించుకునేందుకు వెళ్లామని, దేవుడ్ని దర్శించుకునే అవకాశం ఇంకా మాకు రావడం లేదని ఆ దళిత కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక కొప్పాల్ జిల్లాలోని మియాపూర్ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి చెందిన రెండేండ్ల బాబు పుట్టినరోజున గ్రామంలోని గుడికి వెళ్లి దర్శించుకోవాలనుకున్నారు. గుడిని చూడగానే పిల్లాడు వెంటనే పరుగెత్తుకెళ్లాడు. దాంతో ఆలయం అపవిత్రమైందంటూ గుడి పూజారులు, గ్రామంలోని అగ్రవర్ణాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసేందుకు రూ.25 వేలు ఖర్చవుతున్నందున, ఆ మొత్తం జరిమానాగా చెల్లించాలని దళిత కుటుంబాన్ని ఆదేశించారు. ఈ విషయం తెలియగానే అధికారులు వెంటనే గ్రామానికి వచ్చి ఇరుపక్షాల వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
‘నా కొడుకు పుట్టినరోజున గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రార్థనలు చేయాలనుకున్నాం. అప్పుడే వర్షం కురియడంతో మా కుమారుడు ఒక్కసారి ఆలయంలోకి పరుగెత్తుకెళ్లాడు. దాంతో గుడి అపవిత్రం అయిందని అగ్రవర్ణాలు మాకు జరిమానా విధించాయి. అన్యాయమని మొత్తుకున్నా వినలేదు’ అని రెండేండ్ల చిన్నారి తండ్రి చంద్రు చెప్పారు.
గ్రామంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలుగకుండా ఉండేందుకు చంద్రు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిరాకరించడం విశేషం.
కోవిడ్ బాధిత కుటుంబాలకు రూ.50 వేల పరిహారం : కేంద్రం ప్రతిపాదన
మరింత గొప్పగా తిరిగొస్తున్నారు : అమరీందర్ సింగ్ ఓఎస్డీ ట్వీట్ సంచలనం
కొత్త విదేశాంగ మంత్రిగా నారాయణ్ ఖడ్కా
‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’.. వివాదంలో ఎంఐఎం పోస్టర్
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
మెక్డోనాల్డ్స్ బర్గర్లో తేలు.. కేసు నమోదు
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..