ఔరంగాబాద్, మార్చి 19: మహారాష్ట్రలోని టిపేశ్వర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చెందిన ఓ పులి ఆహారాన్ని వెతుక్కొంటూ 2 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. తెలంగాణలోని అటవీ ప్రాంతం గుండా నడుస్తూ అజంతా గుహలను చేరి అక్కడి నుంచి గౌటాలా వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి చేరింది. ఈ నెల 15 గౌటాలా వన్యప్రాణి కేంద్రంలో పులి నడుస్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.