మన దేశంలో చెవి ఆరోగ్యం పట్ల అవగాహన తక్కువ. ఏ సమస్య వచ్చినా పట్టించుకోరు. వినికిడి లోపాలనూ చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి చెవుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. అంతేకాదు..
దేశంలో 70 కోట్లమంది వినికిడికి సంబంధించి ఏదో ఓ సమస్యను ఎదుర్కొంటున్నారు.
‘ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్' ప్రకారం ప్రతి ఐదు లక్షలమందికి ఒక ఆడియాలజిస్ట్ మాత్రమే ఉన్నారు.
చిన్నతనంలో టీకాలు వేయించుకోక పోవడం వల్లే దాదాపు 60 శాతం మనుషుల్లో వినికిడి సమస్యలు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
దేశంలో పదిలక్షలమందికి ఒక టీచర్ (వినికిడిలోపం ఉన్నవాళ్లకు చదువు చెప్పేందుకు) ఉన్నారు.