భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెల్లను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ గూడాచారి సంస్థ, ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ) కార్యకర్తులుగా అనుమానించపడుతున్న ఇద్దరు పాకిస్తాన్ పౌరులతో ఇండోర్కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెల్లు సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ఆరోపణలు.
పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. నిందిత మహిళలను విచారిస్తున్నారు. వారి పాకిస్తాన్ పరిచయాలు ధృవీకరించబడే ఆధారాలు లభించినట్లుగా విశ్వసనీయ సమాచారం. 32 ఏళ్లు, 28 సంవత్సరాల వయస్సు గల ఈ అక్కాచెళ్లెల్లు ఇండోర్ సమీపంలో ఉన్న మోవ్ అని పిలువబడే డాక్టర్ అంబేద్కర్ నగర్లో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు.
నకిలీ గుర్తింపుల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పాకిస్థాన్కు చెందిన వ్యక్తులతో ఏడాది కాలంగా కాంటాక్ట్లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. వారి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.