విశాఖ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ రవాణా
నాగ్పూర్, ఏప్రిల్ 24: ఆక్సిజన్ను వేగంగా రవాణా చేసేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు సేవలను ప్రారంభించాయి. గురువారం విశాఖపట్నం నుంచి 100 టన్నుల ఆక్సిజన్ నింపుకొన్న ఏడు ట్యాంకర్లతో బయల్దేరిన తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం ఉదయం 10.25 గంటలకు నాసిక్కు చేరుకొన్నది. ముందు నాగ్పూర్లో 3, నాసిక్లో 4 ట్యాంకర్లను అన్లోడ్ చేశారు. మరోవైపు, మూడు ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ జార్భండ్లోని బొకారో నుంచి బయల్దేరి శనివారం లక్నో చేరుకొన్నది. ఒక్కో ట్యాంకర్లో 15 వేల లీటర్ల ఆక్సిజన్ను రవాణా చేశారు. లక్నోలో రెండు ట్యాంకర్లు, వారణాసిలో ఒక్క ట్యాంకర్ను అన్లోడ్ చేశారు.