కుమ్రంభీం ఆసిఫాబాద్ : పంట చేనుకు అమర్చిన విద్యుత్ కంచె తగిలి ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషాద సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఐనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
నాలుగు రోజుల వ్యవధిలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. దహేగాం సబ్ ఇన్స్పెక్టర్ రఘుపతి వివరాలను వెల్లడిస్తూ.. మృతుడు ఐనం గ్రామానికి చెందిన పుల్క లచ్చన్న(45)గా, గాయపడ్డ వ్యక్తిని సుధాకర్గా పేర్కొన్నారు.
లచ్చన్న సంఘటనా స్థలంలోనే మృతిచెందగా ఇతన్ని కాపాడటానికి వెళ్లిన సుధాకర్ గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం బాధితుడిని కాగజ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక వేటగాళ్లు అడవి పందుల కోసం విద్యుత్ కంచెను ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.