హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు టాప్ జీఎస్టీ పేయర్ అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను సర్వీస్ ప్రొవైడర్ కేటగిరిలో ఈ ఘనత దక్కింది. జీఎస్టీ నాల్గో వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అవార్డును అందుకున్నారు. సరకు రవాణా, ప్యాసింజర్ సేవలు, ప్రకటనలు, క్యాటరింగ్ సర్వీసుల ద్వారా రూ.332.83 కోట్ల జీఎస్టీ వసూలు, చెల్లింపులను చేసింది.