ఢిల్లీ,జూలై:ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన వెహికల్స్ లో ఆంపియర్ మాగ్నస్ ,జీల్ మోడల్స్ సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. వీటి టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్లు. ఈ రెండింటి బ్యాటరీ రేంజ్ విషయానికి వస్తే, ఇవి పూర్తి ఛార్జీపై 75 కిలోమీటర్ల రైడ్ రేంజ్ను అందిస్తాయి.మొబిలిటీ అవసరాలకు అనుగుణంగా,దాని ఛార్జ్ 2 రోజుల వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.
భారతదేశంలో ఆంపియర్ ఎలక్ట్రిక్ తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 80వేల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ప్రస్తుతం ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.47,990 లకే లభిస్తున్నది. ఆంపియర్ జీల్ స్కూటర్ ధర ఇప్పుడు 41,990 రూపాయలకే లభిస్తున్నది.