శ్రీనగర్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనకు ముందు ఐఐఎం జమ్ములో కరోనా కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్లోని ఐఐటీ జమ్ములో 19 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇందులో విద్యార్థులు, సిబ్బంది కూడా ఉన్నారు. ఐఐటీలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో మొత్తం 180 మందికి పరీక్షలు చేయించామని అధికారులు తెలిపారు. వారిలో 19 మంది పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఈనెల 9న కాన్వకేషన్ సెంటర్లో జరగనున్న ఐఐటీ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనాల్సి ఉన్నది. కాగా, కరోనా కేసులు వచ్చినప్పటికీ ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యసిస్తారని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఎల్జీ మనోజ్ సిన్హా కూడా హాజరవుతారని తెలిపారు.
దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో 1,26,789 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 685 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనాల మరణాల సంఖ్య 1,66,862కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజీలాండ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్లోని న్యూజిలాండ్ పౌరులకు కూడా ఇది వర్తిస్తుందని ఆదేశ ప్రధాని జెసిండా అర్డెర్న్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..