మెట్పల్లి/ కరీంనగర్ : తండ్రి మరణంతో విషాదంలో ఉన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు. మెట్పల్లి పట్టణ సమీపం రేగుంటలోని బాల్క సుమన్ ఇంటికి వచ్చిన మంత్రి ఆయనను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాల్క సురేష్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, శ్రీహరి రావు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి