లక్నో: ఉత్తరప్రదేశ్లో వందల సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రయాగరాజ్లోని మోతీలాల్ నెహ్రూ హాస్పిటల్లో ప్రస్తుతం 171 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. వారంతా వైరల్ ఫీవర్, ఎన్సెఫాలిటిస్, న్యుమోనియా వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్దారు. ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేక ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచారు. మరి కొంత మంది పిల్లలు నేలపై పరిచిన పరుపులపై ఉన్నారు.
మరోవైపు పిల్లలకు ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నట్లు ప్రయాగరాజ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నానక్ సరన్ తెలిపారు. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. పిల్లలు పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురవుతుండటంతో 200 పడకల పిల్లల వార్డును త్వరలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
కాగా, ప్రధానంగా వరద ముంపు ప్రాంతాలకు చెందిన పిల్లలు రోగాల బారినపడుతున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్లో పిల్లలకు ఏం జరుగుతున్నది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ బిడ్డలకు చికిత్స సరిగా అందకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను వైద్యులు పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.