శంషాబాద్, మార్చి 23 : ప్రగతి పయనంలో 13 వసంతాలు.. ఎన్నెన్నో మైలురాళ్లు…. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు… అంచెలంచెలుగా ఎదిగిన జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమై 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14ఏటా అడుగీడింది. ఈ మేరకు 13 సంవత్సరాల్లో ఎయిర్పోర్టు ప్రత్యేకతలను ఎయిర్పోర్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
దేశంలో పబ్లిక్ పార్టనర్ షిప్తో నిర్మించిన మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం.
2008 మార్చి 23న ఎయిర్పోర్టు ప్రారంభం.
ప్రారంభంలో సంవత్సరానికి 12 మిలియన్ ప్రయాణికులు, 1,50,000 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం.
ప్రస్తుతం 62 ఇంటర్నేషనల్, 64 దేశీయ విమానాలు రాకపోకలు
నూతన సాంకేతికలు ఆవిష్కరణ
దేశంలోని విమానాశ్రయ రంగంలో శంషాబాద్ ఎయిర్పోర్టు పలు నూతన సాంకేతికలను ఆవిష్కరించుకుంది. అందులో ఏఓసీసీ(ఆపరేషన్ కంట్రోల్ సెంటర్). భవిష్యత్లో ప్రయాణికుల పెరుగుదలకు అనుగుణంగా విస్తరణ కొనసాగుతుంది. 34ఎంపీపీఏ ప్రయాణికులకు సరిపోతుంది. 2010లో కార్గోలో డెడికేట్ ఫార్మా ప్రారంభించారు. 2012లో థర్డ్ పార్టీ ఎయిరో ఫ్రేమ్ ఎంఆర్వో అయిన జీఎంఆర్ ఎయిర్టెక్నిక్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించారు. 2014లో బిజినెస్ స్కూల్, 2015లో సోలార్ ప్లాంట్, ఇ-బోర్డింగ్ సదుపాయాన్ని కల్పించారు. 2017లో అతిపెద్ద విమానాన్ని హ్యాండ్లింగ్ చేసిన దేశంలో మొట్టమొదటి విమానాశ్రయంగా రికార్డు సాధించింది. 2017లో ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్, 2018లో ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ డిపార్చర్ టెర్మినల్ ప్రారంభమైంది. 2018 డిసెంబర్లో 19.3 లక్షల మంది ప్రయాణించారు. 2019లో 11వ వార్షికోత్సవం సందర్భంగా డొమెస్టిక్ అరైవల్స్ ప్యాసింజర్స్ టర్మినల్ను ప్రారంభించారు. 2019లో రాత్రి సమయాల్లో స్టాండ్ బై సెకండరీ రన్వేను ఉపయోగించుకోవడానికి డీజీసీఏ అనుమతి లభించింది. అదే సంవత్సరం వన్ నేషన్- వన్ ట్యాగ్ క్రింద ఫాస్ట్ ట్యాగ్ కార్ పార్కింగ్ను ఏర్పాటు చేశారు.
కొవిడ్ చర్యలు..
2020 నవంబర్లో కొవిడ్ పరీక్షలు ప్రారంభించారు. 2021 జనవరిలో నాన్స్టాప్ సర్వీస్లను చికాగో- హైదరాబాద్ మధ్య ప్రారంభించారు. డొమెస్టిక్ డిపార్చర్స్ వద్ద పురుద్ధరించిన ప్రీమియం ప్లాజాను ప్రారంభించారు. గత ఫిబ్రవరిలో హైదరాబాద్- మాలే విమాన సర్వీస్లు ప్రారంభించారు.
అనేక అవార్డులు
ప్రయాణికులకు విశేష సేవలందిస్తూ శంషాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ గుర్తింపుతోపాటు అనేక అవార్డులు పొందింది. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ( ఏఎస్క్యూ) నుంచి 2009 నుంచి 2017 వరకు సేవా నాణ్యత గుర్తింపు, 5-15 ఎంపీపీఏ విభాగంలో 2009, 2010, 2016, ,2017లో నాలుగు సార్లు ప్రపంచ నంబర్ వన్ స్థానం ర్యాంక్లు దక్కించుకున్నది. 2019లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం, 2020లో బెస్ట్ ఎయిర్పోర్టు బై సైజ్ అండ్ రీజన్, తెలంగాణ స్టేట్ కంజర్వేషన్ అవార్డు, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్లో గ్రీన్ పవర్ పెర్మాఫామెన్స్ ఎక్సలెన్స్ అవార్డు -2020 గెలుచుకున్నది. గత ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మకంగా ఏసీఐ నుంచి వరల్డ్ వాయిస్ ఆఫ్ కస్టమర్ గుర్తింపును పొందింది.