కులకచర్ల, జూన్ 25 : యజమానుల ఆస్తి వివరాలను నమోదు చేసుకోవడానికి తెలం గాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రారంభించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో నూతనంగా ధరణి పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆస్తిమార్పిడికోసం దూరప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ప్రజలు తమ ఆస్తిని రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ధరణి పోర్టల్ను ప్రారంభించిందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ మండలంలోని గ్రామాల్లోని ప్రజలు ధరణి పోర్టల్ను సద్వి నియో గం చేసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలను గమనించిన సీఎం కేసీఆర్ ప్రజ లకు అందుబాటులో ఉండేందుకు వివిధ రకాల సేవలను అందిస్తున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పా టు చేసి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నూతనంగా ఏర్పడిన మండలంలో ప్రజలకు ఇక నుంచి రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతా యని, రెవెన్యూ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చౌడాపూర్ గ్రామ సర్పంచ్ కొత్త రంగారెడ్డి, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఎంపీటీసీ శంకర్, కులకచర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల టీఆర్ఎస్ నాయకులు శేరి రాంరెడ్డి, మరికల్ సర్పంచ్ పాండురంగయ్య, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, గ్రామ పెద్దలు పాల నర్సింహులు, కృష్ణయ్య, శ్రీనివాస్రెడ్డి, ఉమా పతిరెడ్డి, ఉపసర్పంచ్ శివకుమార్, వార్డు సభ్యులు అశోక్, కృష్ణయ్య, రాజు, యాదయ్య, బన్సీలాల్, ఖాజాపాషా, మొబిన్, తాసీల్దార్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈదమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే
పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఈదమ్మ జాతర ఘనంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈదమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈదమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన షిడె కార్య క్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, పీఏసీ ఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ మేడిద రాజేందర్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్య క్షుడు ఆర్. ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్పీ బాబయ్య, బి.ప్రవీణ్ కుమా ర్రెడ్డి, సర్పంచ్ మేడిద పద్మమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, గ్రామస్తులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.