బరువు తగ్గేందుకు చాలామంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు. కొంతమంది వాకింగ్, రన్నింగ్తో పాటు రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. మరికొందరేమో విభిన్న రకాల డైట్లను ఫాలో అవుతుంటారు. వాటిల్లో ఒకటే కీరదోస డైట్ (కుకుంబర్ డైట్) ! ఈ ఎండకాలంలో దొరికే దోసకాయలను డైట్ ఫాలో అయితే తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయట. కేవలం 7 రోజుల్లోనే ఏడు కిలోల బరువు తగ్గొచ్చని కూడా చెబుతున్నారు. మరి అది సాధ్యమేనా!!
తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి కీరదోస ఉపయోగపడుతుంది. ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల కేవలం 7 నుంచి 14 రోజుల్లోనే 7 కిలోల బరువు తగ్గొచ్చని ట్రెండ్ అవుతుంది. కీర దోసలో తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ డైట్ ఫాలో అవ్వడానికి ఎలాంటి రూల్స్ ఏమీ ఉండవు. మనం రోజూ తినే ఆహారాన్ని తగ్గించి.. కీర దోస ముక్కలను ఎక్కువగా తీసుకుంటే సరిపోద్ది. అలాగే రోజుల్లో ఆకలి అనిపించిన ఎన్నిసార్లు అయినా కీర దోస ముక్కలు తినొచ్చు. అయితే కీరదోసలో కేలరీలతో పాటు ప్రోటీన్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవడం మంచిది. అలాగే కోడిగుడ్లు, చికెన్, చేపలు, తృణధాన్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారు. అందుకోసమే డైట్ ఫాలో అయ్యేవారు తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. అయితే ప్రతిరోజు మనం తినే ఆహారంలో 800 కేలరీలు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ కేలరీలను ఆహారంగా తీసుకుంటే.. తాత్కాలికంగా బరువు తగ్గినా.. సాధారణ డైట్ ఫాలో అవ్వగానే బరువు పెరిగిపోతారని ఒక అధ్యయనంలో తేలింది. కీరదోస డైట్ విషయంలో కూడా అంతే. ఎందుకంటే.. 300 గ్రాముల దోసకాయలో 45 కేలరీలు ఉంటాయి. అంటే ఒకరోజులో 3 కిలోల దోసకాయలు తిన్నా.. 450 కేలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. కాబట్టి కీరదోస డైట్ ఫాలో అయినప్పుడు తాత్కాలికంగా బరువు పెరుగుతారు.. సాధారణ డైట్కు రాగానే మళ్లీ బరువు పెరిగిపోతారు. అందుకే బరువును నియంత్రించుకోవడానికి, ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి రకరకాల ఆహార పదార్థాలను తినాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి.
ఈ డైట్ కేవలం 15 రోజుల వ్యవధికి మాత్రమే పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా ఈ డైట్ను ఫాలో అవ్వలేం. ఎందుకంటే దోసకాయలో కేలరీలతో పాటు పోషకాలు కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి. 300 గ్రాముల దోసకాయలో 2 గ్రాముల ప్రోటీన్, 0.3 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది అంతే. ఇవి మన శరీరానికి ఏ మాత్రం సరిపోవు. దీంతో పోషకాహార లోపంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జీవక్రియ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల చిరాకు, అలసట, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే గుడ్లు, చికెన్, చేపలు, పండ్లు, కూరగాయలను కూడా డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
గ్రీన్ టీని అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
నిమ్మరసం, పసుపు కలుపుకుని తాగితే కలిగే లాభాలివే..!