న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు సరిగ్గా 15 రోజుల ముందు కిరణ్ రిజిజు స్థానంలో ఠాకూర్ బాధ్యతలు అందుకున్నారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఠాకూర్ క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 46 ఏండ్ల ఠాకూర్..2016-17 మధ్య కాలంలో బీసీసీఐ అధ్యక్షునిగా వ్యవహరించారు. క్యాబినెట్ మంత్రిగా భారత ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.