ఢిల్లీ , జూన్ 14 :కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖచెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ, తన ప్లాంట్ల ల్లో రెండు పైలెట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ‘ (ఈవోఎల్) ఆహ్వానించింది. ఆ ప్రాజెక్టులు ‘స్వతంత్ర ఇంధన అణు ఆధారిత బ్యాకప్ విద్యుత్ వ్యవస్థ’, ‘ఎలక్ట్రోలైజర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తితో స్వతంత్ర ఇంధన అణు ఆధారిత మైక్రోగ్రిడ్ వ్యవస్థ’. ఈ ప్రాజెక్టుల ద్వారా పర్యావరణహితంతో స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ సిద్ధమవుతున్నది. ప్రాజెక్టుల అమలు, వాణిజ్యీకరణకు ఆయా సంస్థలకు సాయపడనున్నది.
విద్యుత్ కోసం హైడ్రోజన్ సాంకేతికతను వినియోగించాలన్న ఈ ప్రాజెక్టులు ఎన్టీపీసీ ప్రయత్నాల్లో భాగం. విద్యుత్ ప్లాంట్ ఫ్లూ గ్యాస్, హైడ్రోజన్ నుంచి విద్యుత్ విశ్లేషణ ద్వారా తీసుకున్న మెథనాల్ ఇంటిగ్రేటింగ్ కార్బన్ తయారీ కోసం సంస్థ ఇప్పటికే ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి, బ్యాకప్ విద్యుత్ అవసరాల కోసం హైడ్రోజన్ ఆధారిత ఇంధన కణాలు-ఎలక్ట్రోలైజర్ వ్యవస్థల వినియోగాన్ని ఎన్టీపీసీ పరిశీలిస్తున్నది. ప్రస్తుతానికి బ్యాకప్ విద్యుత్, మైక్రోగ్రిడ్ అవసరాలు డీజిల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ల ద్వారా తీరుతున్నాయి. హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాల ముందస్తు వినియోగపరంగా చూస్తే, డీజిల్ జనరేటర్లకు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ఎన్టీపీసీ కృషి చేస్తున్నది.