చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో 5G స్మార్ట్ఫోన్లను భారత్లో ఆవిష్కరించనుంది. గతనెలలో రియల్మీ 8, రియల్మీ 8 ప్రొ ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ఇవి రెండూ 4జీ ఫోన్లు కావడంతో వినియోగదారులు కొంత నిరాశకు గురయ్యారు. కస్టమర్ల కోరిక మేరకు 5G కనెక్టివిటీతో కొత్త ఫోన్లను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
మిడ్రేంజ్లో రియల్మీ 8 5G, రియల్మీ 8 ప్రొ 5G తో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నది. 5జీ మోడళ్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే అనేక సర్టిఫికేషన్ వెబ్సైట్లలో కనిపించాయి. దీంతో పాటు రియల్మీ 8 సిరీస్లో 5జీ వేరియంట్లు ఉంటాయని రియల్మీ ఇండియా అధిపతి మాదవ్ సేథ్ ధృవీకరించారు.