లక్నో : దాయాది దేశం పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన ఐదుగురిని అరెస్టు చేసి, మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 15వ తేదీన జలాలాబాద్ క్రాసింగ్స్ వద్ద కొంతమంది పాక్కు అనుకూలంగా నినాదాలు చేసిన వీడియో పోలీసుల దాకా చేరింది. దీంతో ఆ వీడియోను నిశితంగా పరిశీలించిన అనంతరం, స్థానిక మసీదు ఇమామ్ మౌలానా మహమ్మద్ అఫ్జల్తో పాటు సల్మాన్, షాహీద్, మేరాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.