సంస్మరణకు తరలివచ్చిన అమరవీరుల కుటుంబసభ్యులు
ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళులర్పించిన ఎంపీలు..
పోలీసుల భారీ బందోబస్తు
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 20 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు మంగళవారం స్వేచ్ఛగా నివాళులర్పించారు. నాలుగు దశాబ్దాల తర్వాత సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులతోపాటు గాయాలపాలైన బాధితులు నివాళులర్పించారు. వారి త్యాగాలను కొనియాడారు. సంస్మరణకు భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరాగా.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ సమీపంలో అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో మంగళవారం అమరవీరులకు స్వేచ్ఛగా ఘన నివాళులర్పించారు. 40 ఏండ్ల తర్వాత తమ సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూ జలు చేసి, శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలో ని ఆయా గ్రామాల నుంచి ఆదివాసీ గిరిజనులు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ముం దుగా ఇంద్రాదేవి ఆలయానికి వెళ్లి సంప్రదాయ పూజలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం ఎదుట ఎరుపురంగుతో రెండు జెండాలను ఆవిష్కరించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు గాయాలపాలైన బాధితులు స్వేచ్ఛగా అమరవీరులకు ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలను కొనియాడారు. ఎంపీలు రేవంత్రెడ్డి, సో యం బాపురావ్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, ఆదివాసీ గిరిజన డా క్టర్ సుమలత, ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ గిరిజన సమన్వయ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సిడాం భీమ్రావ్, మానవ హక్కుల వేదిక ఉభయరాష్ర్టాల ఉపాధ్యక్షుడు ఆత్రం భుజంగ్రావ్, తు డుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొడప నగేశ్, సలహాదారుడు ఆర్కా ఖ మ్ము, అమరవీరుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పుర్కా బాపురావ్, కార్యదర్శి కోట్నాక్ బారిక్రావ్, నాయకుడు తుంరం జుగాదిరావ్, బీ జేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్శంకర్, తుడుందె బ్బ మండలాధ్యక్షుడు మెస్రం నాగ్నాథ్, ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సమాజ్ మండలాధ్యక్షు డు సోయం రామ్దాస్, మాజీ ఎంపీపీ కనక తు కారాం, కోరెంగా సుంకట్రావ్, తొడసం నాగోరావ్, కినక జుగాదిరావ్ నివాళులర్పించారు.
తొడసం ఖట్టికి నివాళి..
ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడి మృతిచెందిన తొడసం ఖట్టికి తుమ్మగూడ గిరిజనుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సమక ఎక్స్రోడ్డు వద్ద ఖట్టి స్మరకార్థం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడారు. ఆదివాసీ గిరిజనుల కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం ఉద్యమాలు చేసిన తొడసం ఖట్టిని అప్పటి పోలీసులు హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఆరేళ్లు నిర్బంధం చేశారన్నారు.
సమస్యలు పరిష్కరించాలి : ఎంపీలు
ఈ సందర్భంగా ఎంపీలు రేవంత్రెడ్డి, సోయం బాపురావ్ ఆదివాసీ గిరిజనులతో సమావేశమయ్యారు. ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలన్నారు. తమ హక్కుల కోసం ఉద్యమించి, పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన అమరవీరుల పోరాటం వృధాపోవద్దన్న ఉద్దేశంతోనే యేటా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖతోపాటు ఐటీడీఏ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీ గిరిజనులకు అందించాలన్నారు.
నాగోబా ఆలయంలో పూజలు..
అంతకుముందు కెస్లాపూర్ నాగోబా ఆలయంలో ఎంపీ రేవంత్రెడ్డి, మెస్రం వంశీయులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాను దర్శించుకున్నారు. ముందుగా మండలంలోని ముత్నూర్ గ్రామంలో కుమ్రం భీం విగ్రహానికి పూల మాల వేసి, నివాళులర్పించారు. ఆయన వెంట సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, మెస్రం వెంకట్రావ్పటేల్, తుకారాం, శేఖర్బాబు, బాదిరావ్పటేల్, తొడసం నాగోరావ్, నాగ్నాథ్, పు ర్కా బాపురావ్, గండ్రత్ సుజాత, ఎండీ మసూ ద్, రితేశ్రాథోడ్, విష్ణుముకాడే పాల్గొన్నారు.
పోలీసుల భారీ బందోబస్తు..
ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితోపాటు ఇంద్రవెల్లి ఎస్ఐ నాగ్నాథ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్తూపం చుట్టూ ప్రత్యేక బలగాలను మోహరించి, ప్రత్యేక నిఘా ఉంచారు. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. స్తూపంతోపాటు ప్రభావిత ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి, డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేశ్కుమార్, ఆయా మండలాల పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.