కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో షూటింగ్స్ చేయాలన్నా, చిత్రీకరణలో పాల్గొనాలన్నా కూడా అందరి గుండెలలో గుబులు రేగుతుంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు జగపతిబాబు కొద్దిరోజుల వారకు తాను షూటింగ్లో పాల్గొనలేనని దర్శక నిర్మాతలకు స్ట్రైట్గా చెప్పేశాడట. కరోనా తీవ్రత దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జగపతి బాబు శర్వానంద్, సిద్ధార్ద్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న మహా సముద్రం చేస్తున్నాడు.
మహా సముద్రం తాజా షెడ్యూల్ వైజాగ్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో జగపతి బాబు పాల్గొనాల్సి ఉండగా, కరోనా తీవ్రత వలన రాలేనని చెప్పాడట. రీసెంట్గా ఆయన తన ట్విట్టర్లో మేకప్ వేసుకుంటున్న ఫొటో షేర్ చేస్తూ.. కరోనా వలన నాకు నేను మేకప్ మెన్గా మారానని ఓ ఫొటో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈయనకు తెలుగులోనే కాక తమిళం,హిందీ భాషలలోను పలు ఆఫర్స్ వస్తున్నాయి.