న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రయాణికుల సౌకర్యార్థం ‘139 టోల్ఫ్రీ’ నంబర్ను రైల్వే తీసుకొచ్చింది. ఫిర్యాదులు, ఇతర ఏ సమాచారాన్నైనా తెలుసుకునేందుకు ఈ నంబర్కు ఫోన్ చేయాలని రైల్వే సూచించింది. గతంలో ఫిర్యాదులు తదితర వాటికి వేర్వేరు టోల్ఫ్రీ నంబర్లు ఉండగా వాటన్నింటినీ కలిపి ‘రైల్ మదద్’ పేరుతో 139 టోల్ఫ్రీ నంబర్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని పేర్కొంది. 139 నంబర్కు వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 99.93 శాతం పరిష్కరించామని రైల్వేమంత్రి వైష్ణవ్ తెలిపారు.