న్యూఢిల్లీ: వివిధ అంశాలపై పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వాయిదా పడుతున్నాయి. పెగాసస్, నూతన వ్యవసాయ చట్టాలు, కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తదితర అంశాలపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. తత్ఫలితంగా రూ.130 కోట్ల పై చిలుకు ప్రజాధనం వ్రుధా అయ్యిందని ప్రభుత్వ వర్గాల కథనం. జూలై 19వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే.
దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులతోపాటు మీడియా ప్రతినిధుల, కొందరు మంత్రుల ఫోన్లను పెగాసస్ స్పైవేర్తో హ్యాక్ చేశారని విపక్షాల ఆరోపణ. సమావేశాలు మొదలైనప్పటి నుంచి పెగాసస్ స్పైవేర్పై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. కానీ దీన్ని కేంద్రం కొట్టి పారేస్తున్నది.
తత్ఫలితంగా విపక్షాలు ఉభయ సభలను స్తంభింప చేయడంతో సభా కార్యకలాపాలు ముందుకు సాగడంలేదు. దీంతో కొన్ని రోజులుగా వాయిదాల పరంపర కొనసాగుతున్నది. మొత్తం 54 గంటలు పనిచేయాల్సిన లోక్సభ కేవలం ఏడు గంటలు.. రాజ్యసభ 53గంటలకు 11 గంటల సమయం మాత్రమే పని చేశాయని అధికార వర్గాలు చెప్పాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!