అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు యువ హీరో వైష్ణవ్తేజ్. ఆయన తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ (తమిళ ‘అర్జున్రెడ్డి’ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్నివ్వగా, విజయ్దుర్గ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ “ఉప్పెన’ చిత్రంతో యువతకు దగ్గరైన వైష్ణవ్తేజ్ను కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసే సినిమా ఇది. కేతికాశర్మ కథానాయికగా నటిస్తుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బాపినీడు.
ఇవి కూడా చదవండి..