మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ, మే 23: కేవలం ఈ ఒక్క నెలలోనే 12వ సారి ఇంధన ధరలు పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 17 పైసలు, డీజిల్పై 29 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.99.49కి పెరిగింది. 12 సార్లు పెరిగిన ధరలను కలిపి లెక్కిస్తే లీటరు పెట్రోల్పై రూ.2.81, డీజిల్పై రూ.3.34 పెరిగింది.