రఘునాథపాలెం, ఏప్రిల్ 8 : గిరిజన మండలంగా ఉన్న రఘునాథపాలేనికి స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ భవనం మంజూరైనట్లు మండల ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, మాజీ వైస్ చైర్మన్ మందడపు నర్సింహారావు, వైస్ ఎంపీపీ గుత్తా రవి, మాజీ జడ్పీటీసీ అజ్మీరా వీరూనాయక్, రైతుబంధు సమితి జిల్లా సమితి సభ్యుడు మందడపు సుధాకర్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, దిశ కమిటీ సభ్యుడు మెంటెం రామారావు మాట్లాడారు. మండలంలోని ఈర్లపూడి రెవెన్యూ సర్వే నెంబర్ 370లోని 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో గిరిజన పాఠశాల భవనం నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రూ.20 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. అంతేగాక మండలంలోని నాలుగు ప్రధాన రహదారులను రెండు లైన్లుగా విస్తరించేందుకు రూ.14.73 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు.
మండలంలో గిరిజన పాఠశాల, రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి పువ్వాడకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలాన్ని ఇప్పటికే అభివృద్ధి పథంలో తీసుకవెళ్తున్న మంత్రి పువ్వాడ ప్రస్తుతం గిరిజన పాఠశాలను తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు. మట్టి రోడ్లు లేని మండలంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రధాన రోడ్ల విస్తరణకు రూ.14.73 కోట్లు తీసుకవచ్చిన మంత్రికి రుణపడి ఉంటామన్నారు. మండలంలోని అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల మరమ్మతులకూ నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి మోహన్రావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, గంగిరెడ్డి విజయ్రెడ్డి, బానోతు రవిప్రకాశ్, సర్పంచ్లు సక్రూనాయక్, శరత్కుమార్, మంగీలాల్, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, నర్సింహారావు, యాసా రమేశ్, నంద్యానాయక్, ఎంపీటీసీ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.