ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
టీఆర్ఎస్ 29వ డివిజన్ అభ్యర్థి గుండు సుధారాణి ప్రచారం
వరంగల్, ఏప్రిల్ 26: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే పేదల కష్టాలు తీరుతున్నాయని గ్రేటర్ 29వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గుండు సుధారాణి అన్నారు. సోమవారం డివిజన్లో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్, రఘునాథ్ కాలనీ, రామన్నపేట ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. బొట్టు పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తరలిరాగా గుండు సుధారాణి ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింట్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకుండా ఆదుకుంటున్న దయగల ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలువాలని ఆమె కోరారు. మరోసారి ఆశీర్వదించి, అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
సమష్టి ప్రచారం
29వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుండు సుధారాణి గెలుపు కోసం డివిజన్ నేతలు సమష్టిగా పనిచేస్తూ, ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల ఓటర్లను కలుస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటెయ్యాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ గెలుపు డివిజన్ అభివృద్ధ్దికి నాంది అంటూ ఓటర్లకు కార్యకర్తలు వివరిస్తున్నారు. జడ్పీటీసీ పెద్ది స్వప్న, తాజా మాజీ కార్పొరేటర్ గుండు ఆశ్రితావిజయ్రాజ్, కల్పలత సూపర్మార్కెట్ వైస్ చైర్మన్ షఫీ, టీఆర్ఎస్ డివిజన్ నాయకులు కొడకండ్ల సదాంత్, రాచర్ల రాము, పీ కుమారస్వామి, తాళ్లపల్లి రమేశ్, రుద్ర శ్రీనివాస్, పీ కుమారస్వామి, గట్టు చందుగౌడ్, గుండు శ్రీనివాస్, చంద్రమౌళి, నవీన్, సబ్బని రాజు, శ్రీను, శ్రీనాథ్, తత్తరి రవి, సామల శ్రీనివాస్, మామిడాల రాజు, వీ శ్రీనాథ్, రాచర్ల జగన్, గుల్లపల్లి రాజు, సంజీవ్, ముస్కు సతీశ్, నూర రాజు, నక్క జ్యోతి, తైసీన్, తాళ్ల సురేశ్, సంతోశ్, రామకృష్ణ, సారంగం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఓరుగల్లులో జోరుగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం
ఆచార్య రిలీజ్ పై కొరటాల క్లారిటీ..!