భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. 12 మంది పిల్లలకు కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో నలుగురు నెలలోపు వయసున్న వారు కాగా, మిగతా వారిలో ముగ్గురు ఏడాది లోపు, మరో ముగ్గురు ఏడాది పైబడిన వారు ఉన్నారు. మరో ఇద్దరు చిన్నారులు కొవిడ్ నుంచి కోలుకుని బుధవారం డిశ్చార్జి అయ్యారు.
నెలలోపు వయసున్న నలుగురు చిన్నారులు జిల్లా ఆస్పత్రిలోని సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు జిల్లా మెడికల్ చీఫ్ దులసేన్ జగదేవ్ తెలిపారు. ఒడిశాలో కొత్తగా 849 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 18 ఏండ్ల లోపు ఉన్న వారు 130 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.