గద్వాల రూరల్, ఏప్రిల్4: మండలంలోని పూడూరు, అనంతపురం, కాకులారం, బీరెల్లి, కొత్తపల్లి, శెట్టిఆత్మకూర్ తదితర గ్రామాల్లో ఆదివారం ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని చర్చిలలో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులోని ఎంబీ ఓలీవ చర్చిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పాల్గొని క్రిస్టియన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి శాంతిని కోరుకున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ శాంతి, దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్నారు. దేవుడి ఆశీస్సులతో రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమలు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు కోఆప్షన్ సభ్యురాలు లక్ష్మీదేవి, కౌన్సిలర్ శారద ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సతీష్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ నాయుడు, పాస్టర్ సతీష్ కుమార్, నాయకులు బీసన్న, నాగరాజు, తిమోతి, ప్రవీణ్, తోట రాముడు, నర్సింహులు, రవి, యేసు, ఖాజన్న పాల్గొన్నారు.