న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని అయోధ్య రామాలయ నిర్మాణంలో వినియోగించనున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్టడీ గ్రూప్ ఎన్జీవో ఇప్పటికే నీటిని సేకరించింది. ఈ నీటిని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అక్బర్ రోడ్డులోని తన నివాసంలో ఎన్జీవో నుంచి స్వీకరించారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాల నీటిని సేకరించాలన్న ఆలోచన.. వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబిస్తున్నది’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు.