న్యూఢిల్లీ, ఆగస్టు 3: ‘భారత్ దర్శన్’ టూర్ ప్యాకేజీ ధరను ఒక్కో వ్యక్తికి రూ.11,340గా ఐఆర్సీటీసి నిర్ణయించింది. 11 రాత్రులు, 12 పగళ్లు సాగే యాత్రకు రోజుకి దాదాపు రూ.1,000 చొప్పున ఖర్చవుతుంది. ఈ నెల 29 ప్రారంభమై సెప్టెంబర్ 10న యాత్ర ముగుస్తుంది. హైదరాబాద్, అహ్మదాబాద్, భావ్నగర్, అమృతసర్, జైపూర్, ఐక్యతా విగ్రహం తదితర ప్రదేశాలను ఈ రైలు చుట్టివస్తుంది. టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. పర్యాటకులు ప్రయాణ తేదీకి 48 గంటల్లోపు కరోనా పరీక్ష చేయించుకుని, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును ఉంచుకోవాలి.