న్యూఢిల్లీ: క్లినికల్ ట్రయల్స్లో 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) డ్రగ్ సత్ఫలితాలను ఇస్తున్నదని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లయిడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డా.సుధీర్ చాంద్నా చెప్పారు. ఫేజ్-2 ట్రయల్స్లో 110 మంది, ఫేజ్-3 ట్రయల్స్లో 220 మంది పేషెంట్లు పాల్గొన్నారని, ఫేజ్-2లో మంచి ఫలితాలు కనిపించాయని తెలిపారు. ప్రస్తుతం ప్రామాణికంగా వినియోగిస్తున్న మందులతో పోల్చితే.. 2-డీజీ ఔషధం తీసుకున్న కరోనా బాధితులు రెండు, మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని చాంద్నా వెల్లడించారు.
ఇక, ఫేజ్-3 ఫలితాలు కూడా అశాజనకంగానే ఉన్నాయని శాస్త్రవేత్త సుధీర్ చాంద్నా తెలిపారు. ఇప్పుడు ప్రామాణికంగా వినియోగంలో ఉన్న ఔషధాలు తీసుకుంటున్న కరోనా బాధితుల్లో 31 శాతం మందికి మూడో రోజు నుంచి ఆక్సిజన్ అవసరం తగ్గుతుండగా.. 2-డీజీ డ్రగ్ తీసుకున్న కరోనా బాధితుల్లో మాత్రం 42 శాతం మందికి మూడో రోజు తర్వాత కృత్రిమ శ్వాస నుంచి విముక్తి లభిస్తున్నదని ఆయన వెల్లడించారు. ఈ డాటాను బట్టివ ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొవిడ్ ఔషధాల కంటే.. కొత్తగా రానున్న 2-డీజీ ఔషధమే మెరుగైన ఫలితాలు ఇస్తుందనే విషయం స్పష్టమైందన్నారు.
అయితే, ఈ 2-డీజీ డ్రగ్ ధర ఎంత అనేది ఆ ఔషధం ఉత్పత్తి వ్యయం, తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని సుధీర్ చాంద్నా చెప్పారు. తమ ఇండస్ట్రీ పార్ట్నర్ అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ 2-డీజీ డ్రగ్ ధరను ఖరారు చేస్తుందన్నారు. ఈ ఔషధాన్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రయత్నిస్తున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం
కాబూల్ పేలుళ్లు: 50 దాటిన మృతుల సంఖ్య
క్షణికావేశంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య
పండ్లలో విటమిన్.. ఇమ్యూనిటీ పెంచెన్
మైదా పిండి.. కొడుతుందట ఆరోగ్యానికి గండి..!
మహమ్మారి మరణ మృదంగం.. వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా మృతులు
గోమూత్రం తాగండి.. కరోనాను నిలువరించండి: బీజేపీ ఎమ్మెల్యే సలహా