వికారాబాద్, మే 1: కార్మికులు ప్రభుత్వ హక్కులు, చట్టాలను పొందుతూ అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ స్ట్రాక్ పాయింట్ వద్ద కార్మికులతో కలిసి మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు న్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
ధారూరు తాసిల్దార్ కార్యాలయంలో..
ధారూరు, మే 1 : మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో కార్మికులు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు మైపాల్, సీఐటీయూ, సీపీఎం, కార్మిక సంఘాల నాయకులు, వీఆర్వోలు, వీఆర్ఏలు సత్యనారాయణ, మోహన్, గోపాల్, నర్సింహులు, రవి, నగేశ్, శ్రీనివాస్, కిష్టయ్య, వెంకటయ్య, యేసయ్య, శ్రీనివాస్, నారాయణ పాల్గొన్నారు.
మర్పల్లిలో..
మర్పల్లి, మే 1 : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిబ్బంది జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది మధుకర్, మహేందర్, యాదయ్య, అశోక్, పోచయ్య, పెంటయ్య పాల్గొన్నారు.
అంబేద్కర్ కూడలిలో..
కొడంగల్, మే 01 : పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో మే డే పురస్కరించుకొని శనివారం వెంకటయ్య (మాఫి)సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా స్ఫూర్తి భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు జెండా ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి వెంకట్ నరేందర్, పకీరప్ప, కిష్టప్ప, కోస్గి వెంకటప్ప, స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులులతో పాటు అసంఘటిత కార్మికులు, జగన్, వెంకటయ్య పాల్గొన్నారు.