దేశ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తి చేశారు. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన సరసన కృతిసనన్ను సీతగా ఎంపిక చేశారు. ఇక లక్ష్మణుడిగా పలువురు పేర్లు వినిపించగా, చివరికి బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో మెరవనున్నట్టు తెలుస్తుంది.
లక్ష్మణుడి పాత్రలో కనిపించేందుకు సన్నీ మెళుకువలు నేర్చుకుంటున్నాడట. హావ భావాలు, నడవడిక, పాత్ర తీరు తెన్నులు వంటి వాటిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్గా ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగష్టు 11న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, కరోనా వలన పలు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.