న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో క్రమక్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. 129 రోజుల తర్వాత గరిష్ట స్థాయిలో గత 24 గంటల్లో 1,071 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఈ వ్యాధితో ముగ్గురు మృతి చెందారు. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్క మరణం సంభవించింది.
దీంతో ఇప్పటివరకు దేశంలో ఈ మహమ్మారితో మృత్యువాత పడిన వారి సంఖ్య 5,30,802కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.