దుండిగల్ : ప్రతికాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీసుల ఆధ్వర్యంలో రైసినీయా ఇంటెల్లి పార్కు కాలనీలో రూ.5 లక్షలతో స్థానికులు ఏర్పాటు చేసుకున్న 27 సీసీ కెమెరాలను డీసీపీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారుతుందన్నారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రతి పోలీస్స్టేషన్లో సైబర్క్రైం వింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, బాచుపల్లి సీఐ నర్సింహారెడ్డితో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.