బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త హెచ్ఎస్ దొరైస్వామి (103) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 8న దొరైస్వామికి కరోనా సోకింది. 13న డిశ్చార్జి అయ్యారు. అయితే 14న నీరసంగా ఉండటంతో మళ్లీ దవాఖానలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. దొరైస్వామి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 14 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు.