జమేనా: సెంట్రల్ ఆఫ్రికాలోని చాద్ దేశంలో.. సుమారు 300 మంది రెబల్స్ను హతమార్చారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ద ఫ్రంట్ ఫర్ చేంజ్ అండ్ కాంకర్డ్ (ఎఫ్ఏసీటీ) గ్రూపుకు చెందిన రెబల్స్ను హతమార్చినట్లు ఓ ప్రకనటలో ఆర్మీ పేర్కొన్నది. 300 మంది ఉగ్రవాదులను హతమార్చామని, 150 మందిని అదుపులోకి తీసుకున్నామని, కానెమ్ ప్రావిన్సులో జరిగిన ఘర్షణల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ ప్రతినిధి జనరల్ అజెమ్ బెర్మాండోవా అగునా తెలిపారు. ఆ ఘర్షణల్లో ఆర్మీకి చెందిన అయిదుగురు జవానర్లు వీరమరణం పొందారని, 36 మంది గాయపడ్డారని ఆయన వెల్లడించారు. రెబల్స్ వద్ద 26 వాహనాలను సీజ్ చేశారు. దాంట్లో 16 హెవీ వెపన్స్ ఉన్న వాహనాలు ఉన్నాయి. లిబియా బోర్డర్ సమీపంలో ఉన్న టిబెసీ ప్రాంతానికి స్వాంతంత్య్రం వచ్చినట్లు ఎఫ్ఏసీటీ ప్రకటించింది. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ఉగ్రవాదులకు, ఆర్మీ మధ్య భీకర ఫైరింగ్ జరిగింది. నిజానికి ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ ఇట్నో లీడింగ్లో ఉన్నట్లు తెలిసింది.