నాలుగోరోజూ పెట్రో బాదుడు
న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, లీటరు డీజిల్పై 31 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటరు పెట్రోల్ ధర రూ.102.15కు పెరిగింది. మధ్యప్రదేశ్లోని అనూప్పూర్లో రూ.101.86, మహారాష్ట్రలోని పర్భణీలో రూ.99.95కి చేరింది. నాలుగు రోజులుగా పెరిగిన ధరలను కలిపి లెక్కిస్తే.. లీటరు పెట్రోల్పై 88 పైసలు, డీజిల్పై రూపాయి పెరిగింది.