అమరులైన ఫ్రంట్లైన్ వర్కర్ల కుటుంబాలకు..
ఫ్రంట్లైన్ వర్కర్ల కుటుంబాలకు రూ.100 కోట్ల సాయం
ప్రకటించిన ఫార్మా కంపెనీ మ్యాన్కైండ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కరోనాపై పోరులో చనిపోయిన వైద్యులు, పోలీసులు, ఫార్మసిస్టులు, ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.100 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్కైండ్ ప్రకటించింది. మంగళవారం నుంచి ఆయా కుటుంబాలకు డబ్బు పంపిణీ చేస్తామని, మూడు నెలల్లో రూ.100 కోట్లు పంపిణీ చేస్తామని తెలిపింది. ‘కరోనాపై పోరులో ముందుండి ప్రాణాలు వదిలిన ఫ్రంట్లైన్ వర్కర్లకు మనందరం రుణపడి ఉన్నాం’ అని మ్యాన్కైండ్ ఎండీ రాజీవ్ జునేజాఅన్నారు.
రిలయన్స్ చేయూత..
ముంబైలో కరోనా రోగుల కోసం 875 బెడ్లను సమకూరుస్తామని రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఇందులో 145 ఐసీయూ బెడ్లు ఉంటాయని తెలిపింది. నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్సీఐ), సెవెన్ హిల్స్ దవాఖాన, ట్రైడెంట్ హోటల్ తదితరాల్లో ఈ బెడ్లను ఏర్పాటు చేయనున్నారు.