బెంగళూరు: కర్ణాటక సీఎంగా బీఎస్ యెడియూరప్ప వైదొలిగిన తర్వాత ఆయన వారసుడిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బస్వరాజ్ ఎస్ బొమ్మై పేరును బీజేపీ మంగళవారం ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్ రెడ్డి పరిశీలకులుగా హాజరైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బస్వరాజ్ ఎస్ బొమ్మైని తమ నేతగా ఎన్నుకున్నారు.
కర్ణాటక నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న బీఆర్ బొమ్మై గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..
జనతాదళ్ పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దిన బస్వరాజు ఎస్ బొమ్మై 2008లో బీజేపీలో చేరారు.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై తనయుడే బస్వరాజు బొమ్మై.
నార్త్ కర్ణాటక జిల్లా హవేరిలోని ఘిగ్గాన్ నియోజకవర్గానికి చెందిన నేత బీఆర్ బొమ్మై. రాష్ట్రంలో బీజేపీకి సంప్రదాయ మద్దతుదారులుగా ఉన్న లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే.
బీఆర్ బొమ్మై.. సదర్ లింగాయత్ సామాజిక వర్గ నేత. లింగాయత్లో వీరిది ఆదిపత్య గ్రూప్ కాదు. యెడియూరప్ప.. గనిగ లింగాయత్.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బొమ్మై.. జల, హోంశాఖల మంత్రిగా పని చేశారు.
గత మూడు ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్నారు.
-అడ్మినిస్ట్రేషన్పై పట్టు కలిగి ఉన్నారు. ఇతర పార్టీల నేతలతో సుహ్రుద్బావ సంబంధాలు కొనసాగిస్తున్నారు.
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా పలు ఇరిగేషన్ స్కీమ్లను చేపట్టారు.
తండ్రీ కొడుకులు సీఎంగా పని చేసిన జాబితాలో బస్వరాజ్ బొమ్మై చేరనున్నారు.