భోపాల్, జూలై 15: బావిలో పడిన బాలికను రక్షించబోయి మరో 15 మంది మంది బావిలో పడ్డారు. మధ్యప్రదేశ్లోని విదిషా సమీపంలోని గంజ్ భాసోడా గ్రామంలో ఈ ప్రమాదం సంభవించింది. బాలికను కాపాడేందుకు గ్రామస్థులు బావి గోడ దగ్గర భారీగా గుమికూడారు. ఆ ఒత్తిడికి బావి గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో 15 మంది గ్రామస్థులు అందులో పడిపోయారు. పలువురు గాయపడ్డారు. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.