వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అందుబాటులోకి
న్యూఢిల్లీ, జూలై 19: వచ్చే ఏడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆలోపే కనీసం 10 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. 40 నగరాలను కలుపుతూ పరుగుతీసేలా ఈ రైళ్లను పట్టాలెక్కించాలని భావిస్తున్నది. వందే భారత్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఇటీవల రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్విని వైష్ణవ్ ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వందే భారత్ రైళ్లలో వాడే ఎలక్ట్రికల్ సిస్టమ్ల తయారీ వేగాన్ని పెంచాలని హైదరాబాద్కు చెందిన మేధా సంస్థను రైల్వే శాఖ కోరింది. 44 వందే భారత్ రైళ్లకు ఎలక్ట్రికిల్ సిస్టమ్ల తయారీ కాంట్రాక్టును మేధా గత ఏడాది దక్కించుకున్నది. మొదట్లో వచ్చే ఏడాది డిసెంబరు లేదా 2023 మొదట్లో వందే భారత్ కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ముందుగానే పట్టాలెక్కించాలని భావిస్తున్నది. ప్రస్తు తం దేశంలో రెండే వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి ఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్నది. మరో రైలు ఢిల్లీ-కశ్మీర్లోని కట్ఢా మధ్య నడుస్తున్నది.