వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, ఏప్రిల్ 7 : ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉంటారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట పట్టణంలో బుధవారం జరిగిన దుర్గమ్మ పండుగకు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అరూరి మాట్లాడు తూ రైతులు, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర ప్రజలు ఎన్నికల సమయంలో అం డగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రధానంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు విపక్షాల తప్పుడు మాటలు నమ్మకుండా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నా రు. సీఎం కేసీఆర్ కూడా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా 100శాతం నెరవేర్చుతున్నారని తెలిపారు. అనంతరం దేవాలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మె ల్యే రమేశ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్రావును శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మండల నాయకులు పూజారి రఘు, ఎండీ అన్వర్, బొంత కాంతం, పాల్గొన్నారు.
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
న్యూశాయంపేట : వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ డివిజన్లలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదేశించారు. బుధవారం హన్మకొండ హంటర్ రోడ్లోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు. సమీక్ష లో డీఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీ ఈ నెల 9 వరకు పొడిగింపు
భారత సైన్యం మానవత్వం.. స్వదేశానికి పాకిస్థానీ యువకుడు.. వీడియో