నారాయణపేట టౌన్, ఏప్రిల్ 26: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కౌన్సిలర్ అంబిక తెలిపారు. పట్టణంలోని 16వ వార్డులో సోమవారం మున్సిపల్ సిబ్బందితో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు బయటకు వచ్చిన ప్రతిసారి మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, మాస్కులతోనే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. జాగ్రత్తలు పాటించడంతోనే కొవిడ్ను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మూడో హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్..!
కొవిడ్ వ్యాక్సిన్ ధరల తగ్గింపు : ఎస్ఐఐ, భారత్ బయోటెక్ లను కోరిన కేంద్రం