న్యూఢిల్లీ : మనం ఎంతో అభివృద్ధి చెందామని, నాగరిక సమాజంలో ఉన్నామని చెప్పుకున్నా సిగ్గుతో తలదించుకునే అనాగరిక ఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. 2015 నుంచి 2019 వరకూ దేశవ్యాప్తంగా 1.71 లక్షల లైంగిక దాడులు జరిగాయని పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్లో మహిళలపై ఈ తరహా నేరాలు అధికంగా నమోదయ్యాయని పేర్కొంది.
మధ్యప్రదేశ్లో 2015 నుంచి 2019 మధ్య 22,753 లైంగిక దాడి ఘటనలు వెలుగుచూశాయని రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇక రాజస్ధాన్లో 20,937, యూపీలో 19,098, మహారాష్ట్రలో 14,707 లైంగిక దాడి ఘటనలు జరిగాయని చెప్పారు. దేశ రాజధానిలో 2015-2019లో 8051 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయని తెలిపారు.