ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పశ్చిమ రైల్వే జోన్ కీలక నిర్ణయం తీసుకొన్నది.
పశువులు ట్రాక్లపైకి రాకుండా నిరోధించేందుకు ముంబై-అహ్మదాబాద్ రైలు మార్గం వెంబడి 620 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం రూ.264 కోట్లు ఖర్చు చేయనున్నది.