భువనేశ్వర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సామన్య ప్రజలతోపాటు అన్ని రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యోగాసనాలు వేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సరిహద్దుల్లో వివిధ విభాగాలకు చెందిన సైనికులు యోగాసనాలు వేస్తూ యోగా డే జరుపుకున్నారు.
ఈ సందర్భంగా యోగాలో అనుభమున్న పలువురు రకరకాల ఆసనాలు వేస్తూ ఆకట్టుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని బిందుసాగర్ సరస్సులో కొంత మంది శవాసనాలు వేశారు. సరస్సు నీటిపై తామరాకుల్లా తేలియాడుతూ చూపరులకు కనువిందు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.